Land Acquisition | బుల్లెట్​ ట్రైన్​ కోసం భూసేకరణ.. శంషాబాద్‌లో ఉద్రిక్తత

రంగారెడ్డి జిల్లా శంషాబాద్​ సమీపంలోని బహుదూర్‌గూడలో బుల్లెట్ ట్రైన్ టెర్మినల్ భూసేకరణ కోసం అధికారులు రాగా ఉద్రిక్తత నెలకొంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Land Acquisition | రంగారెడ్డి జిల్లా (Ranga Reddy District) శంషాబాద్​ సమీపంలోని బహుదూర్‌గూడలో బుల్లెట్ ట్రైన్ టెర్మినల్ భూసేకరణ కోసం అధికారులు రాగా ఉద్రిక్తత నెలకొంది. సరైన పరిహారం, హామీలు ఇచ్చే వరకు భూములు ఇవ్వబోమంటూ రైతులు ఆందోళనకు దిగడంతో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు.

ప్రభుత్వం బుల్లెట్​ ట్రైన్​ కారిడార్​ కోసం భూములు సేకరిస్తోంది. బహదూర్‌గూడలో 650 ఎకరాలు స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. అయితే ఆ భూములు ఇచ్చేందుకు రైతులు ఒప్పుకోవడం లేదు. సరైన పరిహారం ఇచ్చాకే భూములు ఇస్తామని ఐదు రోజులుగా నిరసన తెలుపుతున్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం పోలీసులు, హైడ్రా అధికారులు గ్రామానికి చేరుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్పష్టమైన హామీ ఇచ్చాకే భూములు తీసుకోవాలని రైతులు డిమాండ్‌ ​చేశారు.

Land Acquisition | అరెస్ట్​తో తోపులాట

Land Acquisition

గ్రామంలోని 650 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవడానికి జేసీబీలో సాయంతో అధికారులు యత్నించారు. అయితే రైతులు అడ్డుకున్నారు. వారిని పోలీసులు అరెస్ట్​ చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో తోపులాట సైతం చోటు చేసుకుంది. అయినా పోలీసులు పలువురు రైతులను అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. ఈ తోపులాటలో ఓ రైతు స్పృహ తప్పి పడిపోయాడు. కాగా రైతుల ఆందోళనకు బీఆర్​ఎస్​ మద్దతు తెలిపింది. వారికి మద్దతుగా వెళ్లిన బీఆర్ఎస్ నాయకుడు పట్లోళ్ల కార్తీక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్​ చేశారు.

ఇది కూడా చదవండి..: H Fast Inspection | ఉస్మానియా బిస్కెట్లు తింటున్నారా.. ఈ విషయం తెలిస్తే షాక్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *