Minority Welfare Telangana | మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం : పీసీసీ చీఫ్​

మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్​ కుమార్​ గౌడ్​ అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Minority Welfare Telangana | మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్​ కుమార్​ గౌడ్​ అన్నారు. మిలాద్​ ఉన్​ నబీ సందర్భంగా మైనార్టీలనుద్దేశించి నగరంలోని నెహ్రపార్క్​ వద్ద ఆయన ప్రసంగించారు.

Minority Welfare Telangana | భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి

పీసీసీ చీఫ్​ (PCC Chief) బొమ్మ మహేష్​ కుమార్​ గౌడ్ మాట్లాడుతూ.. పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని సూచించారు. కాంగ్రెస్​ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ, ఉర్దూ అకాడమీ ఛైర్మన్​ తాహెర్​ బిన్​ హందాన్​, వ్యవసాయ కమిషన్​ సభ్యుడు గడుగు గంగాధర్​, డీసీసీ అధ్యక్షుడు నగేష్​ రెడ్డి, సీనియర్​ నాయకుడు నరాల రత్నాకర్​ మైనారిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు నగరంలో మైనారిటీలు భారీ బైక్​ ర్యాలీలు తీశారు. ఈ సందర్భంగా పోలీసులు భద్రత ఏర్పాట్లు పర్యవేక్షించారు.

ఇది కూడా చదవండి..: Nizamabad Student Death | అమెరికాలో రోడ్డు ప్రమాదం.. నిజామాబాద్​ వాసి మృతి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *