అక్షరటుడే,నిజామాబాద్ క్రైం: Nizamabad Child Kidnapping | నగరంలోని(Nizamabad) బస్టాండ్ సమీపంలో జీజీహెచ్కు(GGH Nizamabad) అనుబంధంగా ఉన్న మాతా శిశు ఆస్పత్రిలో ఆదివారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్కడ పనిచేస్తున్న సెక్యూరిటీ సిబ్బందిపై పలువురు దాడికి యత్నించారు..
Nizamabad Child Kidnapping | బాలుడి కిడ్నాప్ ఉదంతంలో..
వివరాల్లోకి వెళ్తే.. బాల్కొండ(balkonda) మండలంలోని నాగాపూర్ గ్రామానికి చెందిన భార్యాభర్తలు ఇద్దరు పిల్లలతో శనివారం చికిత్స నిమిత్తం మాతాశిశు ఆస్పత్రికి వచ్చారు. అయితే వారిద్దరు పిల్లలు బయట ఆడుకుంటుండగా.. అందులో చిన్న బాలుడిని ఓ మహిళ మాయమాటలు చెప్పి ఎత్తుకెళ్లింది. ఈ ఘటనపై సెక్యూరిటీ సిబ్బంది నిర్లక్ష్యం ఉందని ఆరోపిస్తూ నాగాపూర్ గ్రామస్తులు కొందరు ఆదివారం మాతాశిశు ఆస్పత్రికి వచ్చారు. అక్కడి సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. దాడికి యత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని వారిని సముదాయించారు.
Nizamabad Child Kidnapping | 8 బృందాలతో బాలుడి కోసం సెర్చింగ్..
నగరం నడిబొడ్డున జీజీహెచ్ అనుబంధ మాతాశిశు ఆస్పత్రిలో బాలుడి కిడ్నాప్ జిల్లావ్యాప్తంగా సంచలనంగా మారింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఉదంతాన్ని సీరియస్గా తీసుకున్న సీపీ సాయిచైతన్య ప్రత్యేకంగా 8 బృందాలను నియమించారు.
ఇది కూడా చదవండి: India Population Clock | రాకెట్ వేగంతో పెరుగుతున్న జనాభా.. ఎయిమ్స్ డిజిటల్ పాపులేషన్ క్లాక్ సంచలనం