అక్షరటుడే, వెబ్డెస్క్: POCSO Case | హైదరాబాద్ (Hyderabad) నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ బాలికపై నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
మూడు వేర్వేరు ప్రాంతాల్లో మూడు రోజుల పాటు ఒక బాలికపై అత్యాచారం చేశారు. పోలీసులు 9 మందిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆ బాలికకు మత్తుపదార్థాలు ఇచ్చి అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు తొమ్మిది మందితో పాటు, ఒక ఓయో హోటల్ యజమాని, మేనేజర్ను పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు.
POCSO Case | ఓయో రూమ్కు తీసుకెళ్లి..
విక్కీ అనే యువకుడు, అతడి గ్యాంగ్ మొత్తం 9 మంది కలిసి బాలికపై అఘాయిత్యం చేశారు. ఈ నెల 8న విక్కీ బాలికకు మత్తుమందు ఇచ్చి తీసుకెళ్లారు. ఆమెను గుండ్లపోచంపల్లిలోని ఒక ఓయో రూమ్కు తీసుకెళ్లాడు. అక్కడ బాలికకు గంజాయి తాగించి విక్కీతో సహా నలుగురు అత్యాచారం చేశారు. మరుసటి రోజు షామీర్పేటలోని ఒక నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్కు తరలించి విక్కీతో పాటు మరో ఇద్దరు కలిసి రేప్ చేశారు. ఈ నెల 10న మేడ్చల్లో ఆగి ఉన్న ఒక రైలులోకి మరోసారి అఘాయిత్యం చేశారు. వారి నుంచి తప్పించుకున్న బాలిక ఇంటికి చేరుకొని కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి, నిందితులను అరెస్ట్ చేశారు.
ఈ వీడియో చూడండి: హీరోయిన్ల ఫిట్నెస్ సిక్రెట్ ఇదేనా..