అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Nizamabad Ganja Seizure | నగరంలో(Nizamabad) గంజాయి విక్రయాలు కలకలం రేపాయి. పక్కా సమాచారంతో ఎక్సైజ్ పోలీసులు(Excise police) విక్రయదారులను అదుపులోకి తీసుకున్నారు.
Nizamabad Ganja Seizure | నగరంలోని పూలాంగ్ వద్ద..
నగరంలోని పూలాంగ్, బోధన్ బస్టాండ్ ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారంతో ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ఎండు గంజాయి అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 200 గ్రాముల ఎండు గంజాయిని(Drug Trafficking), రెండు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తును అదుపులోకి తీసుకుని రిమాండ్ చేసినట్లు తెలిపారు. తనిఖీల్లో సీఐ వెంకటేష్, రామ్కుమార్, సిబ్బంది భూమన్న, విఠల్, లక్ష్మీనర్సయ్య, శివకుమార్ , సాయికుమార్, శ్యాంసుందర్, ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ముగ్గురు అదనపు న్యాయమూర్తులను నియమించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము