అక్షరటుడే, బాన్సువాడ: Congress promises | కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తవుతున్నా ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ (Bajireddy Govardhan) ఆరోపించారు. ‘కాంగ్రెస్ వెయ్యి రోజుల దగా’పై బాన్సువాడలో (Banswada) బీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో మాట్లాడారు.
Congress promises | బాన్సువాడ నుంచి నిజామాబాద్కు రోడ్డు..
తమ హయాంలో బాన్సువాడ నుంచి నిజామాబాద్ వరకు డబుల్ రోడ్డు నిర్మాణం, నిజాంసాగర్ కెనాల్ లైనింగ్ వంటి అనేక అభివృద్ధి పనులు చేపట్టామని బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. అప్పటి సీఎం కేసీఆర్ నిధులు మంజూరు చేయడంతోనే అభివృద్ధి పనులు జరిగాయని, ఇప్పుడు వాటిని తామే చేశామని చెప్పుకోవడం సరికాదన్నారు. దమ్ముంటే నిధులు తీసుకురండి.. అభివృద్ధి చేసి చూపించండి అంటూ సవాల్ విసిరారు. ప్రజలు ఇచ్చిన అధికారంతోనే ఇక్కడ బీఆర్ఎస్ జెండా ఎగురుతోందని, ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే వారి పేర్లు రాసి పెట్టుకోవాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, మోరీల్ శ్రీనివాస్, అంజిరెడ్డి, మాజీ ఎంపీపీ కోటగిరి శ్రీనివాస్, కిషన్, జుబేర్, ధర్మతేజ, మోచి గణేష్, సాయిబాబా, రమేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: ఎవరెస్ట్, ఎల్జీ ఇంగువపై నిషేధం