అక్షరటుడే, వెబ్డెస్క్ : ACB Raid Mahabubnagar | మ్యుటేషన్ ఫైల్ను ఉన్నతాధికారులకు పంపేందుకు రూ.15 వేలు లంచం డిమాండ్ చేసిన మహబూబ్నగర్ (Mahabubnagar) కలెక్టరేట్లో సర్వే, ల్యాండ్ రికార్డ్స్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర రెడ్డిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ సిబ్బంది, ఆఫీస్లోనే ఆయన లంచం డబ్బులు తీసుకుంటుండగా అరెస్ట్ చేశారు.
మహబూబ్నగర్ జిల్లా బూత్పూర్ మండలం కర్వేన గ్రామానికి సంబంధించిన గ్రామ పటంలో సవరణలు చేయడానికి అసిస్టెంట్ డైరెక్టర్ (సర్వే, భూ రికార్డుల)కు ఫైలు సమర్పించడం కోసం కార్యాలయంలో పని చేసే సూపరింటెండెంట్ బొమ్మిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి లంచం డిమాండ్ చేశాడు. రూ.15 వేలు ఇస్తేనే పనులు చేస్తానని చెప్పాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఫిర్యాదుదారుడి నుంచి బుధవారం లంచం తీసుకుంటుండగా సూపరింటెండెంట్ వెంకటేశ్వరరెడ్డిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం కార్యాలయంలో సోదాలు చేశారు.
ACB Raid Mahabubnagar | లంచం ఇవ్వొద్దు
ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే తమకు ఫిర్యాదు చేయాలని కోరారు. ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064, వాట్సాప్ నంబర్ 9440446106 లో ఫిర్యాదు చేయవచ్చని వివరించారు. వెబ్సైట్ (ACB Website) ద్వారా కంప్లైట్ చేయొచ్చని పేర్కొన్నారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.
దీనిని కూడా చదవండి : Anganwadi Jobs | నిరుద్యోగ మహిళలకు గుడ్న్యూస్.. అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల