Manala Mohan Reddy | ఎంపీ అర్వింద్​ నోరు అదుపులో పెట్టుకోవాలి..: మానాల మోహన్​రెడ్డి

సీఎం, మంత్రుల గురించి మాట్లాడేటప్పుడు ఎంపీ అర్వింద్​ నోరు అదుపులో పెట్టుకోవాలని రాష్ట్ర కోఆపరేటివ్​ యూనియన్ ఛైర్మన్​ మానాల మోహన్​ రెడ్డి అన్నారు.

Shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ : Manala Mohan Reddy | సీఎం, మంత్రుల గురించి మాట్లాడేటప్పుడు ఎంపీ అర్వింద్​ నోరు అదుపులో పెట్టుకోవాలని రాష్ట్ర కోఆపరేటివ్​ యూనియన్ ఛైర్మన్​ మానాల మోహన్​ రెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు.

Manala Mohan Reddy | ఆధారాల్లేకుండా సీఎం, మంత్రులపై ఆరోపణలా..?

ఎలాంటి ఆధారాలు లేకుండా సీఎం, మంత్రులపై ఎంపీ అర్వింద్​ (MP Arvind) ఆరోపణలు చేయడం ఎంత వరకు సబబని మానాల ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస పాలనలో సీఎం రేవంత్​రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వ హయాంలో ఎలాంటి స్కామ్​లు లేవని.. అలాంటిది సీఎం, మంత్రులను ఉద్దేశిస్తూ ‘మీకు పుట్టగతులు ఉండవు’ అని ఎంపీ మాట్లాడడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.

Manala Mohan Reddy | నీట్​ పరీక్ష స్కాంపై ఎంపీ ఎందుకు మాట్లాటలేదు..

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన ‘నీట్​’ పరీక్ష స్కామ్​పై ఎంపీ ఎందుకు మాట్లాడలేదని మానాల ప్రశ్నించారు. ఈ స్కాంలో బీజేపీకి సంబంధించిన ముఖ్య నాయకుల అనుచరులే ఉన్నారని.. దీనికి ఎంపీ ఏం సమాధానం చెప్తాడన్నారు. ఈ స్కాంకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా రాజీనామా చేయాలని ఈ దేశ యువత ఉద్యమాలు చేస్తున్నారన్నారు. అలాంటిని ఈ విషయాన్ని తప్పుదోప పట్టించేందుకు ఎంపీ చేస్తున్న వ్యాఖ్యలను ప్రజలు పట్టించుకోరని ఆయన పేర్కొన్నారు.

Manala Mohan Reddy | రెండేళ్లుగా జిల్లాకు ఎంపీ ఏం చేశాడు..

Manala Mohan Reddy

రాష్ట్రంలో రెండున్నరేళ్లలో సీఎంతో సహా మంత్రులు వివిధ పథకాల అమలులో తీవ్రంగా శ్రమిస్తున్నారని ఆయన అన్నారు. కానీ ఈ రెండేళ్లలో ఎంపీగా అర్వింద్​ జిల్లాకు ఏం చేశాడో చెప్పాలని మానాల డిమాండ్​ చేశారు. వివిధ పథకాల అమలులో లబ్ధిదారుల ఎంపిక నుంచి పథకం పూర్తిస్థాయి అమలు వరకు పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చిన చరిత్ర సీఎం రేవంత్​రెడ్డిదని ఆయన పేర్కొన్నారు.

Manala Mohan Reddy | దేశంలోనే నంబర్​వన్​ తెలంగాణ..

దేశం మొత్తంగా ఎక్కువగా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని మానాల మోహన్​ రెడ్డి తెలిపారు. అలాంటిని ధాన్యం కొనుగోళ్లపై బస్సుయాత్ర పెట్టిన బీజేపీ ఎలాంటి స్పందన లేకపోవడంతో మధ్యలోనే యాత్ర ఆపేసిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన ఫండ్​ విషయంలో పోరాడాలి తప్ప రాష్ట్రంపై పసలేని ఆరోపణలు చేసి పరువు తీసుకోవద్దని ఆయన హితవు పలికారు. మరోసారి తప్పుడు ఆరోపణలు చేస్తే ఖబడ్దార్​ అని హెచ్చరించారు. రూ. 35వేల కోట్లను ధాన్యం కొనుగోళ్ల కింద రైతుల ఖాతాల్లోకి జమచేశామని ఆయన పేర్కొన్నారు. అవినీతిలో పుట్టి పెరిగిన ఎంపీ అర్వింద్​కు కాంగ్రెస్​ ప్రభుత్వ పాలనపై మాట్లాడే హక్కు ఏమాత్రం లేదని ఆయన అన్నారు.

ఇది కూడా చదవండి..: RTA Bus Inspections | ఆర్టీఏ అధికారుల ముమ్మర తనిఖీలు..

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *