అక్షరటుడే వెబ్డెస్క్: Ponguleti Srinivasa Reddy | సంక్షేమం, అభివృద్ధిని జోడించి ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తోందని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ( Ponguleti Srinivasa Reddy ) స్పష్టం చేశారు. తిరుమలాయపాలెం ఎంపీడీవో కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు, సీఎం రిలీఫ్ ఫండ్ పత్రాలను అందజేసిన అనంతరం ఆయన మాట్లాడారు.
Ponguleti Srinivasa Reddy | ప్రభుత్వ ఘనతలు ఇవే..
గత రెండేళ్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ముఖ్యంగా,
200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా.
తెల్ల రేషన్ కార్డుల ద్వారా సన్నబియ్యం పంపిణీ, కొత్త కార్డుల జారీ.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గురుకులాల్లో కాస్మొటిక్ ఛార్జీల పెంపు (200%), డైట్ ఛార్జీల పెంపు (40%).
సీఎంఆర్ఎఫ్ (CMRF) ద్వారా పేదలకు వైద్య చికిత్సల కోసం సంవత్సర కాలంలోనే రూ. 1,034 కోట్ల సహాయం అందించామన్నారు.
Ponguleti Srinivasa Reddy | ఇందిరమ్మ ఇళ్లు, రుణమాఫీ..
గత ప్రభుత్వం గృహ నిర్మాణాన్ని పట్టించుకోలేదని, తమ ప్రభుత్వం మొదటి విడతలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందని మంత్రి చెప్పారు. త్వరలోనే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి అదనంగా 2 వేల ఇళ్లు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే, 25 లక్షల మంది రైతులకు రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేశామని, రైతు భరోసా సాయాన్ని ఎకరాకు రూ. 12 వేలకు పెంచామని గుర్తు చేశారు.
Ponguleti Srinivasa Reddy | రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు..
గతంలో ధాన్యం కొనుగోళ్లలో జరిగిన నిర్లక్ష్యాన్ని తొలగించి, రికార్డు స్థాయిలో 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించిందని మంత్రి తెలిపారు. మద్దతు ధరతో పాటు క్వింటాల్కు రూ. 500 బోనస్ అందించామని, తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేశామని వివరించారు. నిరుద్యోగులకు 72 వేల ఉద్యోగ అవకాశాలు కల్పించామని పేర్కొన్న మంత్రి, రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేస్తామన్నారు. తక్కువ వర్షపాతం ఉన్నందున రైతులు వ్యవసాయ అధికారుల సలహాలు తీసుకుని పంటలు వేయాలని సూచించారు.
ఇది కూడా చదవండి: Indupriya Troll Allegations | ఖబడ్దార్ షబ్బీర్ అలీ.. ట్రోలింగ్ చేస్తే సహించేది లేదు.. మున్సిపల్ మాజీ ఛైర్పర్సన్ సంచలన వ్యాఖ్యలు..
