Bigala Ganesh Gupta | కాంగ్రెస్​ ప్రభుత్వం ప్రజలను నట్టేట ముంచింది : మాజీ ఎమ్మెల్యే బిగాల

రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలను నట్టేట ముంచిందని అర్బన్​ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్​ గుప్తా అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Bigala Ganesh Gupta | రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలను నట్టేట ముంచిందని అర్బన్​ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్​ గుప్తా అన్నారు. నగరంలోని (Nizamabad) ధర్నా చౌక్​లో వెయ్యిరోజుల్లో కాంగ్రెస్​ పాలన వైఫల్యాలపై ఫ్లెక్సీలను ప్రదర్శించారు.

Bigala Ganesh Gupta | ఏం ఉద్దరించారని సంబరాలు

వెయ్యి రోజుల పాలన పూర్తయిందని కాంగ్రెస్​ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారని.. వారు ఏం ఉద్దరించారో స్పష్టం చేయాలని బిగాల పేర్కొన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్​ ప్రభుత్వం గతంలో ఉన్న పథకాలకు మంగళం పాడిందని ఆయన ఆరోపించారు. 420హామీలు ఇచ్చి వాటిలో ఏమీ అమలు చేయకుండా కాలయాపన చేస్తోందన్నారు. తమ బతుకులు మారుతాయని కాంగ్రెస్​కు ఓటేస్తే వారి నోట్లో మట్టి పోస్తున్నారని దుయ్యబట్టారు.

Bigala Ganesh Gupta | 420 ఫీట్ల భారీ ఫ్లెక్సీ..

రేవంత్​రెడ్డి ఇచ్చిన హామీలు విఫలమైనందున ఆ హామీలతో కూడిన 420 ఫీట్ల భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేసి నిరసన కార్యక్రమాలు తెలుపుతున్నామని బిగాల పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ మేయర్​ దండు నీతూకిరణ్​, బీఆర్​ఎస్​ సిటీ అధ్యక్షుడు సిర్పరాజు, నుడా మాజీ ఛైర్మన్​ ప్రభాకర్​ రెడ్డి, సీనియర్​ నాయకుడు సత్యప్రకాశ్​, సుజిత్​ సింగ్​ ఠాకూర్​, ఢిల్లోడ్​ ఆకాశ్, మంజుల యాదవ్​​​, జమాల్​పూర్​ రమేశ్​, నీలగిరి రాజు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: వెండితెరపై ‘పవర్ స్టార్’.. రాజకీయాల్లో ‘జనసేనాని’.. 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *